అబిడ్స్, అక్టోబర్ 26 : రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మామ, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు మజ్జిగ నర్సింహయాదవ్ సంస్మరణ సభ గురువారం నాంపల్లిలోని రెడ్రోజ్ ఫంక్షన్హాల్లో జరిగింది.
హోంమంత్రి మహమూద్అలీ, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు రాజాసింగ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, మాగంటి గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే ప్రేమ్సింగ్ రాథోడ్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్, నేతలు ఆనంద్గౌడ్, ఆల పురుషోత్తం, రామచంద్రరాజు, సంతోష్గుప్తా, మమతగుప్తా, శాంతిదేవీ, ధన్రాజ్, ప్రకాశ్ గుప్తా తదితరులు హాజరై దివంగత నర్సింహయాదవ్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.
అనంతరం నర్సింహయాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నర్సింహ యాదవ్ స్వాతంత్య్ర పోరాటంలో అందించిన సేవలు మరువలేనివని కొనియాడారు.