Minister Talasani | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అప్రమత్తం చేశారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నందున ఎక్కడ ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలు అత్యవసర సేవల కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, హైదర్ నగర్, బాచుపల్లి, ప్రగతి నగర్, నిజాంపేట్, బోరబండ, యూసుఫ్గూడ, సనత్నగర్, అమీర్పేట, మైత్రీవనం, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, రాంనగర్, ముషీరాబాద్, కోఠి, నారాయణగూడ, మలక్పేట, అంబర్పేట, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడనున్న ఆవర్తన ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో రాబోయే రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.