హైదరాబాద్: తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్లో ర్యాలీని మంత్రి తలసాని శ్రీవివాస్ యాదవ్ ప్రారంభించారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ సర్కిల్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి తలసాని జాతీయ జెండా చేతబూని ర్యాలీలో కదిలారు. తెలంగాణ ప్రాంతం రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చి 75వ వసంతంలోకి ప్రవేశిస్తున్నామని చెప్పారు.
అనంతరం అమీర్పేటలోని కనకదుర్గమ్మ దేవాలయం నుంచి బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం వరకు నిర్వహించిన ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఏడాదిపాటు వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు.