హైదరాబాద్ : పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద కేబుల్ బ్రిడ్జి ప్రారంభమైంది. ఈ ఫ్లై ఓవర్ను మంత్రులు మహముద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతతో పాటు స్థానిక కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.
ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రావడంతో పంజాగుట్ట నాగార్జున సర్కిల్ వద్ద ట్రాఫిక్ సమస్య తీరనుంది. నాగార్జున సర్కిల్ నుంచి కేబీఆర్ పార్కు సర్కిల్ వైపు రాకపోకలు సాఫీగా సాగనున్నాయి. పంజాగుట్ట శ్మశాన వాటికలో ఉక్కు దిమ్మెలపై ఫ్లై ఓవర్ను నిర్మించారు. శ్మశాన వాటిక సమాధుల పైనుంచి చట్నీస్ హోటల్ వైపు ఉక్కు వంతెన నిర్మించారు.
ఇందుకోసం జీహెచ్ఎంసీ రూ.17 కోట్లు మంజూరు చేసింది. కేబుల్ బ్రిడ్జి, పాత గేటు నుంచి హెచ్టీ లైన్ వరకు రోడ్డును విస్తరించడంతో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మార్గం సుగమమైంది.