హైదరాబాద్ : మట్టి విగ్రహాలను పూజిద్దాం.. పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధి పద్మారావు నగర్ పార్క్లో జీఎచ్ఎంసీ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ కి శ్రీకారం చుట్టామన్నారు.
విగ్రహాల పంపిణీకి నగరంలో సర్కిల్స్ వారీగా అధికారులను నియమించినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడుదామన్నారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.