కంటోన్మెంట్/మారేడ్పల్లి/బొల్లారం, నవంబర్ 2: సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని గురువారం రాష్ట్ర మంత్రి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. లాస్యనందిత చేపట్టిన మొదటివిడత పాదయాత్రకు అద్భుత స్పందన లభించిందన్నారు. పాదయాత్రను దిగ్విజయం చేసిన కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, సాయన్న అభిమానులందరికీ మంత్రి తలసాని అభినందనలు తెలిపారు.
నేటి నుంచి మరింత ఉధృతంగా గులాబీ ప్రచారం కొనసాగుతుందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితతో పాటు పార్టీ శ్రేణులంతా ఎక్కడికక్కడ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని సూచించారు. ఈ మేరకు మంత్రి, కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కార్ఖానాలోని సాయన్న నివాసంలో కీలక భేటీ జరిగింది. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందితకు ప్రజల నుంచి అద్భుత స్పందన లభిస్తోందన్నారు. ఈనెల 9న నామినేషన్ కార్యక్రమం ఉంటుందని.. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుంచి అందరూ పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. దీపావళి తర్వాత ప్రతి వార్డులోనూ పార్టీ ఆఫీసులను ప్రారంభిస్తామన్నారు.
లాస్యనందితను ప్రతి ఒక్కరూ తమ సొంత బిడ్డలా భావించి, ఆశీర్వదించాలన్నారు. ఈ సమావేశంలో కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎన్నికల అదనపు ఇన్చార్జి, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి, మాజీ సభ్యులు అనితా ప్రభాకర్, నళిని కిరణ్, పాండు యాదవ్, భాగ్యశ్రీ శ్యాంకుమార్, లోకనాథం, మాజీ కార్పొరేటర్ ఆకుల రూపహరి, సీనియర్ నాయకులు టీఎన్ శ్రీనివాస్, ఆకుల హరి, నర్సింహ ముదిరాజ్, పలు వార్డుల అధ్యక్షులు, మహిళా నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రెజిమెంటల్బజార్లో…
మోండా డివిజన్ రెజిమెంటల్బజార్లో జీహెచ్ఎంసీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు సీఎన్. నర్సింహ ముదిరాజ్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జి. లాస్యనందితకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహిచారు. ఈ కార్యక్రమంలో అశోక్ ముదిరాజ్, ఆర్. సతీష్, రామ్, ప్రవీన్, క్రిస్టోఫర్, సాయి, రాంపల్లి గోపి, బాబా, నవీన్, సందీప్, టింకు, పరుశురామ్, వెంకటేష్, అనిల్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందితకు మద్దతుగా ఎన్నికల ప్రచారం
కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి జి. లాస్యనందితకు మద్దతుగా నాలుగో వార్డులోని పికెట్ లక్ష్మీనగర్, ఎంఈఎస్ కాలనీ, రైల్వే కాలనీ తదితర ప్రాంతంలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొషన్ చైర్మన్, కంటోన్మెంట్ నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి గజ్జెల నాగేష్, స్థానిక మాజీ బోర్డు సభ్యురాలు నళిని కిరణ్, బీఆర్ఎస్ అభ్యర్థి సోదరి నివేదిత కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి లాస్యనందితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్ మాట్లాడుతూ….ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందంగా మద్దతు ఇస్తున్నారని, కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి జి. లాస్యనందిత భారీ మెజార్టీతో విజయం విజయం సాధించడం ఖాయమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, సీఎం కేసీఆర్ మూడవ సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు టీఎన్, శ్రీనివాస్, వినోద్, శ్రీకాంత్, గంగారామ్, అశోక్ కుమార్, రాంమోహన్, విజయలక్ష్మి, పనస సంతోష్, హ్యాపీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.