అమీర్పేట్, సెప్టెంబర్ 1: వయోధికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన పూర్తి సహకారం ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి ప్రస్తుత కార్యవర్గం కాలపరిమితి సంవత్సరం పొడిగించిన నేపథ్యంలో పాలక మండలి అధ్యక్షులు కాసాని సహదేవ్గౌడ్ ఆధ్వర్యంలో మండలి ప్రతినిధులు బుధవారం మంత్రి తలసానిని ఆయన నివాసంలో కలిసి ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను అభినందిస్తూ త్వరలోనే కౌన్సిల్ కార్యాలయాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శేషుకుమారితో పాటు కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, సంయుక్త కార్యదర్శి మాణిక్రావు పాటిల్, యాదగిరి, లింగమయ్య, ముత్తారెడ్డి, బిచ్చప్ప, అరవింద్గౌడ్ పాల్గొన్నారు.
మంత్రిని కలిసిన మున్సిపల్ కమిషనర్
వరంగల్ మున్సిపల్ కమిషనర్గా పనిచేసి బదిలీపై వచ్చిన సెంట్రల్ జోన్ కమిషనర్ ప్రావీణ్య బుధవారం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను బుధవారం ఆదర్శ నగర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో మర్యాదపూర్వకంగా కలిశారు.