అమీర్పేట, మే 24: ఇటీవల కామారెడ్డిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన బీజేపీ నగర యువమోర్చా కన్వీనర్ ఎలిగెల శశాంక్ ఆర్య కుటుంబసభ్యులను మంత్రి తలసాని ఓదార్చారు.
మంగళవారం సనత్నగర్లోని శశాంక్ నివాసానికెళ్లి చిత్రపటానికి నివాళులర్పించారు. పరామర్శించిన వారిలో కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్రెడ్డి, సంతోష్ సరఫ్ తదితరులున్నారు.