హైదరాబాద్ : విద్యార్థులు తమ లక్ష్యాన్ని సాధించే వరకు ఉచిత కోచింగ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ హరిహర కళా భవన్లో నార్త్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..శిక్షణ తీసుకునే విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం అన్నపూర్ణ వారితో మాట్లాడి భోజన వసతి కల్పిస్తామన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా 80 వేలకు పైగా ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. నిరుద్యోగులు బాగా చదివి ఉద్యోగం సాధించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు. కార్యక్రమంలో నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తి తదితరులు హాజరయ్యారు.