కంటోన్మెంట్ : బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు ప్రాధాన్యత కల్పిస్తూ చేయూతను అందిస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(CM KCR) అన్నారు. ఆదివారం సికింద్రాబాద్ బాలంరాయిలోని క్లాసిక్ గార్డెన్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తిక వన భోజనాల కార్యక్రమంలో బీఆర్ఎస్ కంటోన్మెంట్ అభ్యర్థి లాస్యనందిత, బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్తో పాటు మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో కుల మతాలకు(Cast and Religion) అతీతంగా అన్నివర్గాల ప్రజలకు పారదర్శకంగా చేయూతను అందించామన్నారు. హైదరాబాద్ మరింత అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే నవంబర్ 30న జరుగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ప్రతిపక్షాల మాటల మాయలో పడి మోసానికి గురికావద్దని సూచించారు.
సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అనేక పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రానికి సీఎం కేసీఆర్(CM KCR) నాయకత్వమే శ్రీరామ రక్ష అని తెలిపారు. ఆర్యవైశ్యులకు రాజకీయ గుర్తింపు ఇస్తున్నారని తెలిపారు. ఆర్యవైశ్యులు సేవకు మారుపేరుగా నిలుస్తారని, ఏ దైవ కార్యక్రమం తలపెట్టినా ఆర్యవైశ్యుల పాత్ర తప్పనిసరిగా ఉంటుందన్నారు. ఆర్యవైశ్యులను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అత్యధిక అవకాశాలు బీఆర్ఎస్ పార్టీలోనే లభించాయని వెల్లడించారు. కంటోన్మెంట్లో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.