హైదరాబాద్ : నిత్య వివిధ పని ఒత్తిడికి గురవుతున్న తరుణంలో కొంత సమయం క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా ఉంటామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. జింఖానా గ్రౌండ్స్లో పోలీస్, జీహెచ్ఎంసీ, డాక్టర్స్ ఆధ్వర్యంలో వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
క్రీడాకారులను పరిచయం చేసుకొని.. టాస్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 15 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పోటీల్లో పాల్గొంటున్న వారికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ చందనాదీప్తి, అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీలు రమేశ్, పృథ్వీధర్రావు, సుధీర్, పలువురు సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.