సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : విదేశీ పెట్టుబడి(Foreign investors) దారులకు రాష్ట్రంలో అనుకూలమైన వాతావరణం ఉందని, ఇక్కడున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)పేర్కొన్నారు. రెండు రోజుల కిత్రం టీ హబ్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన మానే గ్రూపు అధ్యక్షుడు జీన్ మానే(Gene Mane) ప్రత్యేకంగా సమావేశమైన కంపెనీ విస్తరణ ప్రణాళికలను వివరించారు.
ఫ్రాన్స్ కేంద్రంగా ఉన్న కంపెనీ ఇప్పటికే రాష్ట్రంలోని తయారీ కేంద్రాన్ని మానే గ్రూపు కలిగి ఉందని విస్తరణ కార్యకలాపాల్లో భాగంగా అదనంగా రూ.200 కోట్లను వెచ్చిస్తామన్నారు. 2003 నుంచి రుచికరమైన తినే పదార్థాలను తయారు చేసే తమ కంపెనీ ఇక్కడున్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కంపెనీ సిద్ధంగా ఉందని జీన్ మానే తెలిపారు.