కందుకూరు, ఆగస్టు 22 : రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దయానంద్ గుప్తాతో కలిసి మంగళవారం మండల కేంద్రంలోని టంకరి రాంరెడ్డి ఫంక్షన్ హాల్లో 300మందికి బీసీ బంధు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ బంధు పథకంతో బడుగు, బలహీన వర్గాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపుతున్నట్లు తెలిపారు.
కులవృత్తుల సంక్షేమానికి ప్రభుత్వం చేయూతను ఇస్తుందని తెలిపారు. బీసీలు సమాజంలో గుర్తింపు తెచ్చుకొని ఆర్థికంగా ఎదుగాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ మంద జ్యోతి పాండు, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, కౌన్సిలర్లు సప్పడి రాజు, రవి నాయక్, లిక్కి మమత కృష్ణారెడ్డి, యాతం పవన్, శంశుద్ధీన్, తదితరులు పాల్గొన్నారు.