బంజారాహిల్స్, ఆగస్టు 13: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలో భాగంగా.. బంజారాహిల్స్ రోడ్ నెం 1లో ఓ ప్రైవేటు కళాశాల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు.. అదే సమయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్ అదే రోడ్డుమీద వెళ్తోంది.
సరిగ్గా ర్యాలీకి సమీపంలోకి రాగానే మంత్రి వాహనంతో పాటు కాన్వాయ్లోని వాహనాలు ఆగాయి. కారులోంచి దిగిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల చేతిలో నుంచి జాతీయ జెండాను తీసుకుని తాను కూడా ర్యాలీలో కొంతదూరం పాల్గొన్నారు.
దీంతో అక్కడున్న విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. స్వయంగా విద్యాశాఖ మంత్రి తమతో కలిసి ర్యాలీలో పాల్గొనడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.