పహాడీషరీఫ్లో రూ.3.10కోట్లతో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
పహాడీషరీఫ్/కందుకూరు, జూన్ 13: ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా తనవంతు కృషి చేస్తున్నానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. పహాడీషరీఫ్ నుంచి మామిడిపల్లి గ్రామానికి వెళ్లే రోడ్డు అభివృద్ధికి రూ.3.10కోట్ల వ్యయంతో సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ జీపీ కుమార్, అధికారులు సుధీర్బాబు, అయేషా, రమ్య, కౌన్సిలర్లు కొండల్యాదవ్, నయీం, ఖాలెద్ బిన్ అబ్దుల్లా, దస్తగిర్, షేక్ అఫ్జల్, శంషోద్దీన్, కెంచె లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, మజర్ అలీ, కో-ఆప్షన్ మెంబర్ సూరెడ్డి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఇక్బాల్ బిన్ ఖలీఫా, యూసుఫ్ పటేల్, ఖైసర్బామ్, అబ్దుల్లా, యంజాల జనార్దన్, వాసుబాబు, ఎంఏ సమీర్, యాస్మిన్ బేగం, విశాల్గౌడ్, నాగేశ్ ముదిరాజ్, ఎంఆర్పీఎస్ నాయకుడు యంజాల అర్జున్, తదితరులు పాల్గొన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం ..
పేదలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సోమవారం మండల పరిధిలోని రాచులూరు గ్రామంలో డయేరియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని రాజశేఖర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు జయేందర్, యూత్ నాయకులు తాళ్ల కార్తిక్, కొలను విఘ్నేశ్వర్రెడ్డి, బొక్క దీక్షిత్రెడ్డి, రామకృష్ణ, సర్పంచ్ శ్రీనివాసచారి డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఘనంగా బీరప్ప ఉత్సవాలు ..
మండల పరిధిలోని ఆకులమైలారం గ్రామంలో ఘనంగా బీరప్ప జాతర ఉత్సవాలను నిర్వహించారు. ఆదివారం ప్రారంభమైన ఉత్సవాలు సోమవారం కామరాతి. బీరప్పల కల్యాణం నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ నందీశ్వర్ సర్పంచ్ కళమ్మ రాజు, ఎంపీటీసీ పద్మ పాండు, అందెల శ్రీరాములు, ఎంపీపీ జ్యోతి పాండు హాజరై స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు.