బడంగ్పేట, నవంబర్ 17: ‘పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టాలి.. మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశమిస్తే మరింత ప్రగతి చేసి చూపిస్తా.. ప్రతి కుటుంబం ఏదో రూపంలో సర్కారు సాయం పొందాయి.. వారంతా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను గెలిపించాలి’.. అని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. అన్ని ప్రాంతాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ మహేంద్ర ఎలైట్ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి హాజరై మాట్లాడారు. పది సంవత్సరాల కాలంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని పేర్కొన్నారు.
కాలనీ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి..
మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1,2,3,4,18,19, 20, 21,41 డివిజన్ల పరిధిలో ఉన్న కాలనీ అసోసియేషన్ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. అన్ని కాలనీల అసోసియేషన్ నాయకులు మంత్రికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ తీర్మాణం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు కష్టాలల్లో ఉన్నప్పుడు పట్టించుకోని నాయకులు కొత్తగా వచ్చి ఓట్లు అడిగితే ఎలా వేస్తారని అన్నారు. పనిచేసే వారిని గుర్తించుకోవాలన్నారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. కులమత బేదం లేకుండా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరిందన్నారు.
మరోసారి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తే రూ.16వేల రైతు బంధు ఇవ్వడం జరుగుతుందన్నారు. 400లకే గ్యాస్ సిలిండర్, ఐదు వేలు పింఛన్, 93 లక్షల తెల్లరేషన్ కార్డుదారులకు బీమా సౌకర్యం కల్పిస్తామన్నారు. లావాణి భూములకు పట్టాదారు హక్కు కల్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ర్టానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు వచ్చిందంటే ముఖ్య మంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వల్లనే అన్నారు. మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వస్తే ప్రజా పాలన వస్తుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనించాలన్నారు. వారి మాయ మాటలతో మోసపోవద్దు అన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, మాజీ సర్పంచ్ పల్లె పాండు గౌడ్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.
ప్రతిపక్షాలను నమ్మి మోసపోవద్దు
కందుకూరు, నవంబర్ 17: ప్రతిపక్షాల మోస పూరితమైన హామీలు నమ్మి మోసపోవద్దన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణరెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమంలో చిలకమర్రి నర్సింహ, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, వైస్ చైర్మన్ గోపిరెడ్డి విజేందర్రెడ్డి, మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, కాకి దశరథ ముదిరాజ్, ఆనేగౌని అంజయ్యగౌడ్, చిర్ర సాయిలు, వట్నాల ఈశ్వర్గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు మంద సాయిలు, గొరిగే కళమ్మ రాజు, జ్యోతి చంద్రశేఖర్, సరళమ్మపాండు, ఇందిరమ్మ, శ్రీలత, శ్రీహరి, బుడ్డొల్ల నరేందర్గౌడ్, కృష్ణ రాంభూపాల్రెడ్డి, ర్యాపాకు ప్రభాకర్రెడ్డి, మేఘనాథ్రెడ్డి, సామ మహేందర్రెడ్డి, ఢిల్లీ శ్రీధర్ ముదిరాజ్, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, ఎంపీటీసీ కాకి రాములు, గుయ్యని సామయ్య, ఆనేగౌని పాండుగౌడ్, సొలిపేట అమరేందర్రెడ్డి, యూత్ నాయకులు శ్రీకాంత్రెడ్డి, తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్రెడ్డి, వెంకటేశ్, పాండు, మాజీ సర్పంచ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.
మంత్రి గెలుపు నియోజకవర్గం అభివృద్ధికి మలుపు
మహేశ్వరం, నవంబర్ 17: మంత్రి సబితా ఇంద్రారెడ్డి గెలుపు మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి మలుపు అని ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బుసగల్ల జంగయ్య తెలిపారు. తుమ్ములూరు గ్రామంలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని ఉపసర్పంచ్ కటికల శ్రీహరి ముదిరాజ్తో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కటికల శ్రీహరి ముదిరాజ్, వార్డు సభ్యులు మద్ధి శ్రీధర్రెడ్డి, చంద్రయ్య బూత్ కమిటీ సభ్యుడు అంజయ్య నాయకులు రాజు, సరేందర్రెడ్డి, లింగారెడ్డి, నాగార్జున, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
సబితాఇంద్రారెడ్డి గెలుపును ఆపలేరు
ఆర్కేపురం, నవంబర్ 17 : మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితాఇంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సరూర్నగర్ డివిజన్ హుడా కాంప్లెక్స్లోని 24 అపార్ట్మెంట్స్లో బీఆర్ఎస్ సరూర్నగర్ డివిజన్ నాయకులు, హుడా కాంప్లెక్స్ అపార్ట్మెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్, స్ఫూర్తి మహిళా మండలి సభ్యులతో కలిసి నియోజకవర్గంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి సబితాఇంద్రారెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బేర బాలకిషన్, పారుపల్లి అనితాదయాకర్రెడ్డి, లోకసాని కొండల్రెడ్డి, బోయిని మహేందర్యాదవ్, ఇంటూరి అంకిరెడ్డి, ధర్పల్లి అశోక్, రాజేశ్గౌడ్, ధరంవీర్రెడ్డి, అనూప్రాజు, మల్లారెడ్డి, లోడి నర్సింహ గౌడ్, రిషి తదితరులు ఉన్నారు.