ఓపెన్ జిమ్స్,చిల్డ్న్ పార్కు ఏర్పాటు చేయాలని ఆదేశం
చెరువు చుట్టూ వీధి దీపాల ఏర్పాటు
పనులను పరిశీలించిన మంత్రి సబితారెడ్డి
బడంగ్పేట, మార్చి 19:మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు సుందరీకరణ పనులను మంత్రి సబితాఇంద్రారెడ్డి శుక్రవారం పరిశీలించారు. చెరువు చుట్టూ ఏర్పాటు చేస్తున్న లైటింగ్ సిస్టమ్ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నూతన హంగులతో చెరువులను సుందరీకరణ చేయిస్తున్నామని ఆమె అన్నారు. చెరువు పక్కన ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెరువును చూడటానికి వస్తున్న చిన్న పిల్లల కోసం పార్కు, ఆట వస్తువులను ఏర్పాటు చేయిస్తామన్నారు. షెటిల్ కోర్టులు ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. ప్రజలకు ప్రశాంతత కోసం యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు.
బాలాపూర్ మండల పరిధిలో ఉన్న అన్ని చెరువులను దశల వారీగా సుందరీకరిస్తామన్నారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ దుర్గాదీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ విక్రంరెడ్డి, కమిషనర్ సుమన్రావు, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షురాలు లావణ్యబీరప్ప, కార్పొరేటర్స్ పవన్ కుమార్, భూపాల్ రెడ్డి,మాధవిఈశ్వర్ గౌడ్, రామచందర్,బీరప్ప, కోఆప్షన్ జంగయ్య గౌడ్, టీఆర్ఎస్ నాయకులు సాయినాథ్రెడ్డి, రవీందర్రెడ్డి, భూపేశ్గౌడ్, నిర్మలారెడ్డి, పాండు గౌడ్ తదితరులు ఉన్నారు.