మహేశ్వరం, ఆగస్టు 4 : చిరువ్యాపారులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరంలో రోడ్డు వెడల్పులో భాగంగా చిన్నచిన్న వ్యాపారులు స్థలం కోల్పోతున్నారు. మార్కెట్యార్డు డైరెక్టర్ దిద్దెల అశోక్కుమార్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు మంత్రిని కలిసి బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చిరు వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇరువర్గాలతో చర్చించి తగు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. కార్యక్రమంలో వ్యాపారులు సుమన్, మంఖాల్ రామచంద్రి, నడికుమార్, ఆగయ్య, దండక పెంటయ్య, సేవక్, గండ్ల శేఖర్, సాంబయ్య, నాగేందర్, నాగమణి, ఈశ్వరమ్మ, ఒగ్గు లక్ష్మయ్య, చంటి తదితరులు పాల్గొన్నారు.