హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలో (Medchal district) కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు కొనసా గుతున్నాయి. సొంత పార్టీ నేతలపైనే(Congress leaders) దాడుకులకు(Attacked) పాల్పడుతుంటంతో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డిపై దాడి మేడ్చల్ – అన్నోజిగూడ డిమార్ట్ దగ్గర వారం రోజుల క్రితం పార్టీ మీటింగ్ సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. దీంతో సొంత పార్టీ నాయకుడు, అతడి అనుచరులు దాడికి పాల్పడ్డారు. గాయపడిన శ్రీకాంత్ రెడ్డి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.