కందుకూరు, జూలై 28 : సీఎం కేసీఆర్ నిరుపేదలకు అండగా ఉంటూ.. ప్రతి ఇంట్లో ప్రభుత్వ పథకాలు అందే లా కృషి చేస్తూ.. ప్రతి ఒక్కరి దీవెనలను అందుకుంటున్నారు. సమైక్య రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నిరుపేదలు స్వరాష్ట్రంలో ప్రభుత్వ పథకాలను పొం దుతూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కరోనా విపత్కర సమయంలోనూ సంక్షేమ పథకాలు ఆపకుండా అమలు చేస్తున్నారు.
పేదింటి ఆడ బిడ్డల పెండ్లి చేయడానికి ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఎంతోమంది ఆడపడుచుల వివాహలకు దోహదపడుతున్నా యి. ఆడబిడ్డల పెండ్లిలు చేసి ఇబ్బందులు పడుతున్న వా రికి ఈ పథకాలు కొండంత అండగా నిలుస్తున్నాయి. ఈ పథకం ద్వారా మండల పరిధిలోని 35గ్రామ పంచాయతీలతో పాటు అనుబంధ గ్రామాల నిరుపేదలకు ఏడాది లో రూ. 3కోట్ల 50లక్షలను ప్రభుత్వం చెల్లించింది. దీం తో లబ్ధిదారులు ఆనంద పడుతూ సీఎం కేసీఆర్ చల్లగా ఉండాలని దీవెనలు ఇస్తున్నారు.
పేదలకు సీఎం కేసీఆర్ చేస్తున్న సహయన్ని ఎప్పటికి మరిచిపోం. ఆడబిడ్డల వివాహానికి సహాయం చేసి ఆపదలో ఉన్న మమ్ములను ఆదుకుంటున్నారు. కరోనా సమయంలో మాకు కల్యాణలక్ష్మి చెక్కును ఇచ్చి ఆదుకున్నారు. రూ. లక్షా 116లు చెల్లించడం మా కుటుంబానికి ఆసరాగా నిలించింది. గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. కేసీఆర్ సారుకు ఎప్పుడు అండగా ఉంటాం.- మాడుగుల లలిత, కొత్తగూడ
ఆడబిడ్డల వివాహలకు ప్రభుత్వ సహాయం కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా లబ్ధిదారులు దరఖాస్తు చేసిన వెంటనే విచారణ జరిపి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలతో ఆర్డీవో అనుమతితో ఆలస్యం లేకుండా నిధులను మంజూరు చేస్తున్నాము. ఇప్పటి వరకు మండలంలో దాదాపుగా రూ. 3కోట్ల 50లక్షలను సంవత్సర కాలంలో అందజేశాం. అంతే కాకుండా నిరుపేదలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. – ఎస్. జ్యోతి తాసీల్దారు, కందుకూరు