ఆర్కేపురం, జూలై 16 : పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు మౌలిక వసతులు కల్పించి మహేశ్వరంను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం సరూర్నగర్ డివిజన్ హుడా కాలనీ ఏ టైపు పార్కులో కోటి రూపాయలతో ఆధునీకరించనున్న గ్రీనరీ థీమ్ పార్కు పనులకు శంకుస్థాపన, సాయితేజ హాస్పిటల్ దగ్గర రూ.60 లక్షలతో సీసీ రోడ్డు పనులకు, భగత్సింగ్ నగర్లో తాగునీటి సౌకర్యం కోసం నూతన పైపులైన్ పనులకు స్థానిక కార్పొరేటర్ శ్రీవాణితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గం అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో పక్కా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తమ నియోజకవర్గంలోని అర్హులైన ప్రజలందరికీ అందేలా చూస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తీర్చడంలో సీఎం కేసీఆర్ ముందు వరుసలో ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారని అన్నారు.
పేదింటి ఆడపిల్లల పెండ్లికి పెద్దన్నలా సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం సరూర్నగర్ తాసీల్దార్ కార్యాలయంలో ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్లకు సంబంధించిన 32 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కలను ఆర్కేపురం, సరూర్నగర్ డివిజన్ల కార్పొరేటర్లు రాధాధీరజ్రెడ్డి, ఆకుల శ్రీవాణి, మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ అపవద్దని సీఎం కేసీఆర్ పదే పదే చెప్పేవాడని అన్నారు. ఆడపిల్లల పెండ్లి కోసం తల్లిదండ్రులు అప్పులతో కష్టాలు పడకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తీసుకోచ్చారని తెలిపారు. మన రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను దేశంలోని ఇతర రాష్ర్టాలు అమలు చేసేందుకు కృషి చేస్తున్నాయని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన తరువాత తన నియోజకవర్గంలో 5వేల మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కందుకూర్ ఆర్డీవో చారి, సరూర్నగర్ తాసీల్దార్ రామ్మోహన్రావు, మహేశ్వరం టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, సరూర్నగర్ డివిజన్ అధ్యక్షుడు ఆకుల అరవింద్, నియోజకవర్గ యూత్వింగ్ అధ్యక్షుడు లోకసాని కొండల్రెడ్డి, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్, నాయకులు శ్రీనివాస్, రాజేశ్గౌడ్, నర్సింహాగౌడ్, ఎస్కే మహ్మద్, సుదర్శన్, అంజిరెడ్డి, నారాయణరెడ్డి, నగేశ్, సాజిద్ పాల్గొన్నారు.