మహేశ్వరం/బడంగ్పేట/కందుకూరు/ ఫిబ్రవరి 18: ప్రతి ఒక్కరూ దైవ చింతనను అలవర్చుకోని మానసిక ప్రశాంతతను పొందాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శనివారం మహేశ్వరంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ రాజరాజేశ్వరస్వా మి, గట్టుపల్లిలోని శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకొని మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి మహారుద్రాభిషేకం నిర్వహించారు. దేవాస్థాన కమిటీ సభ్యులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఆ శివుడు సంపూర్ణ ఆరోగ్యం కలిపించాలని ఆమె శివున్ని ప్రార్ధించారు. సీఎం కేసీఆర్ ఆ పరమేశ్వరుడి కృపతో ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆమె వేడుకున్నారు. అలాగే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగు ఏర్పాట్లు చేయాలని ఆమె దేవాస్థాన కమిటీ సభ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు కౌశిక్రెడ్డి, ఎంపీపీ రఘుమారెడ్డి సహకార బ్యాంకు చైర్మన్ మంచె పాండుయాదవ్, దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు అం గోతు రాజునాయక్, మండల పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ వర్కల యాదగిరిగౌడ్, ఎంపీటీసీ సుదర్శన్యాదవ్, సర్పంచ్లు కరోళ్ల ప్రియాంక రాజేశ్, మోతీలాల్నాయక్, మెగావత్ రాజునాయక్, మద్ది కరుణాకర్రెడ్డి, నాయకులు కూన యాదయ్య, కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మునగపాటి నవీన్, మాజీ సర్పంచ్ ఆనందం, దేవాలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహేశ్వరంలోని శ్రీ రాజరాజేశ్వరి, శ్రీ రాజరాజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో చేవేళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్గౌడ్, నాయకులు కూన యాదయ్య దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
బాలాపూర్ మండల పరిధిలోని జిల్లెలగూడ, బడంగ్పేట, మీర్పేట, బాలాపూర్, నాదర్గుల్, అల్మాస్గూడ, కుర్మల్గూడ, మామిడిపల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీల్లో శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మార్మోగాయి. శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివపార్వతుల కల్యాణ వేడుకలు కందుకూరు మండలంలో వైభవంగా జరిగాయి. శివాలయాలతో పాటు దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలోని దేవాలయాల కు భక్తులు వెళ్లి దీక్షలు వదిలారు. దీంతో దేవాలయాల వద్ద భక్తుల సందడి కనిపించింది. ఈ సారి పండ్ల ధరలు భారీ పెరిగాయమని భక్తులు వాపోయారు.