బడంగ్పేట, నవంబర్14: బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డిని గెలిపిస్తామని బాలాపూర్ బీఆర్ఎస్ నాయకులు తిమ్మని గిరీశ్, వంగేటి లక్ష్మారెడ్డి, ఎల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొప్పుల రాజు తదితరులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేసిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటెయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాలనీల్లో ఉన్న ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కావాలంటే మంత్రి సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలని వారు కోరారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరుతున్నాయని వారు ఓటర్లకు వివరించారు. సంక్షేమ పథకాలు రావాలంటే మళ్లీ ముఖ్య మంత్రిగా కేసీఆర్, నియోజక వర్గంలో ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డిని గెలిపించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేస్తే అభివృద్ధి కుంటు పడుతుందన్నారు. కోఆప్షన్ రఘునందన చారి, ఆనంద్, మురళి, సురేశ్, రితిన్ రెడ్డి, విజయ్ సురేశ్ తదితరులు ఉన్నారు.
కందుకూరు, నవంబర్ 14 మంత్రి సబితా ఇంద్రారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎంపీటీసీ తాండ్ర ఇందిరమ్మ దేవేందర్ తెలిపారు. మండల పరిధిలోని మాదాపూరు లో జంగారెడ్డి, సాయిరెడ్డిగూడలో ఇందిరమ్మ దేవేందర్లు ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని కోరారు. సర్పంచ్లు మంద సాయిలు, మహేశ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి,క్రిష్ణరాంభూపాల్రెడ్డి, మాజీ పీఎసీఎస్ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్రెడ్డి,మహేశ్గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు ఆనేగౌని సాండుగౌడ్, మాజీ సర్పంచ్ జంగారెడ్డిపాల్గొన్నారు.
కందుకూరు, నవంబర్ 14 : ప్రతి పక్షాలకు చెందిన అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని నియోజకవర్ంగం బీఆర్ఎస్ పార్టీ ఎస్టీ సెల్ విభాగం అధ్యక్షుడు సభావత్ లచ్చానాయక్ తెలిపారు. సబితా ఇంద్రారెడ్డి విజయం కోసం పెద్దమ్మ తండాలో చిప్పలపల్లి, దన్నారం, మురళీనగర్. పులిమామిడి,పెద్దమ్మ తండా, దావుద్గూడ, తదితర గ్రామాలకు చెందిన యువకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు సమష్టిగా ఉంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు. యువకులను సీఎం కేసీఆర్ అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలపారు. యువకుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు వివరించారు.మాయమాటలను నమ్మి మోసపోవద్దని కోరారు. జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహారెడ్డి, సర్పంచ్ సుమన్ నాయక్,రాజు,ఎలుక మేఘనాథ్రెడ్డి,ఆనేగౌని పాం డుగౌడ్,యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, మండ ల సోషల్ మీడియా కన్వీనరు బొక్క దీక్షిత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మహేశ్వరం, నవంబర్ 14: బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్ అన్నారు. మంగళవారం మహేశ్వరం గ్రామ పరిధిలోని కేబీతండాలో బీఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారాన్ని జిల్లా రైతు సమన్వయ సమితి నాయకుడు కూన యాదయ్య ఇతర నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో నియోజక వర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ పొల్కం బాలయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు దుడ్డు క్రిష్ణయాదవ్, నాయకులు మునగపాటి నవీన్, కర్నాటి మనోహర్, కటికల మైసయ్య పాల్గొన్నారు.
ఆర్కేపురం, నవంబర్ 14 : మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి చేసిన అభివృద్ధిని చూసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ ఎ మ్మెల్యే అభ్యర్థి సబితాఇంద్రారెడ్డి గెలిపించాలని మంగళవారం సరూర్నగర్ గ్రామంలోని బాపునగర్, పోచమ్మ బస్తి, చౌడి శివాలయం, కుమ్మరి బస్తీ, రామాలయం పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ తిరుగుతూ 10 సంవత్సరాల్లో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి సబితాఇంద్రారెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బేర బాలకిషన్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు.