టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యెట్టం సదానంద్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించి సరదాగా క్రికెట్ ఆడుతున్న రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, చిత్రంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ తదితరులు.
సుల్తాన్బజార్, జనవరి 4 : నిత్యం విధి నిర్వహణలో కష్టించే ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడలు కాస్త ఊరటనిస్తాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ ఆధ్వర్యంలో నిర్వహి ంచిన 9వ స్పోర్ట్స్ మీట్లో భాగంగా యెట్టం సదానంద్ క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఫహీమ్ ఖురేషీ, డీపీఆర్వో భాను ప్రసాద్, స్పోర్ట్స్ అధికారి ఎన్. సుధాకర్ రావు, టీఎన్జీవో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకట్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ, సీమా ముజీబ్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర సాధన లో టీఎన్జీవో సంఘం పాత్ర మరువలేనిదని అన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన టీఎన్జీవో సంఘానికి 77 వసంతాలు పూర్తి చేసుకోవడం శుభపరిణామమని అన్నారు. నిత్యం ప్రతి ఉద్యోగి వ్యాయామం చేయడంతో పాటు క్రీడలలో పాల్గొనడం శారీరక ధారుడ్యాన్ని పెంపొందించుకునేలా టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ కృషిని ఆయన ప్రశంసించారు.
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ గత 8 సంవత్సరాలుగా టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్న ముజీబ్హుస్సేనీని, జిల్లా శాఖ కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా శాఖ అధ్యక్షుడు ముజీబ్హుస్సేనీ మాట్లాడుతూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే 9వ నాకౌట్ మ్యాచ్లకు ఈ యేడాది యెట్టం సదానంద్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ పేరిట నిర్వహిస్తున్నామని అన్నారు. జింఖానా మైదానంలో ఈ నెల 4 నుంచి 9వ తేది వరకు నిర్వహించే ఈ నాకౌట్ క్రికెట్ మ్యాచ్లలో 26 టీంలు పాల్గొంటాయని అన్నారు.
ఈ నెల 10,11వ తేదీలలో ఎల్బీ స్టేడియంలో సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్లను నిర్వహిస్తామని అన్నారు. ఉద్యోగుల క్రీడా పోటీలకు అనుమతి ఇచ్చినందుకు కలెక్టర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ కార్యదర్శి ఎస్ విక్రమ్ కుమార్, కోశాధికారి జక్కుల బాలరాజ్, అసోసియేట్ అధ్యక్షుడు కేఆర్ రాజ్కుమార్, ఉపాధ్యక్షులు ఉమర్ఖాన్, కురాడి శ్రీనివాస్, ఎంఎ ముజీబ్, నరేశ్ కుమార్, సభ్యులు సుజాత, ఖాలేద్ అహ్మద్, ప్రచార కార్యదర్శి వైదిక్ శస్త్ర, సభ్యులు బి శంకర్, శ్రీధర్ నాయుడు, ముఖీం ఖురేషీ, అసదుద్దీన్ హుస్సేనీ, ఏపీఆర్వో మహ్మద్ వహీద్, ముస్తఫా షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.