శామీర్పేట, జూలై 27: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే ఆదర్శవంతమైన సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడు చింతలపల్లి మండలం నాగిశెట్టిపల్లి గ్రామంలోని తండాలో యువతులు గురువారం నిర్వహించిన తీజ్ పండగలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. యువతులతో మంత్రి నృత్యాలు చేయగా, యువతులు మంత్రిపై సంతోషంగా పూలవర్షాన్ని కురిపించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తీజ్ పండుగ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతున్నారన్నారు. అన్ని వర్గాల సంస్కృతులు, సంప్రదాయలను గౌరవిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కుల మతాలకు అతీతంగా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, సర్పంచ్ కృపాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ శంకర్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, హరిమోహన్ రెడ్డి, నియోజకవర్గ ఐదు మండలాల అధ్యక్షుడు నీరజ్ గౌడ్, లక్ష్మీనారాయణ, భూమేశ్ గౌడ్, బావుసింగ్ నాయక్, రాములు నాయక్, మాన్య నాయక్, శ్రీనివాస్, యువతులు పాల్గొన్నారు.