కుత్బుల్లాపూర్, జూలై 8: తెలంగాణ రాష్ట్రంలో అన్నీ అవకాశాలకు నిలయంగా మారిందని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను అందించే దిశగా యువత, ఆయా పరిశ్రమ ఆయా రంగాల ప్రతినిధులు ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖామంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో 2022 -23 విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులకు 60 ఎంఎన్సీ కంపెనీల నుంచి 1160 మంది విద్యార్థులకు ప్లేస్మెంట్స్ను అందించాయి. ఈ సందర్భంగా జరిగిన ప్లేస్మెంట్ పండుగలో మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డిలు హాజరై విద్యార్థులను, కళాశాల అధ్యాపకులను అభినందించారు.
ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో నిరుద్యోగ నిర్మూలనతో పాటు గ్రామీణ యువతకు సైతం ఉపాధి అవకాశాలను కల్పించేలా ఆయా హోదాలలో ఉన్న ఇక్కడి విద్యార్థులు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ మార్టిన్ ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.చంద్రశేఖర్ యాదవ్, కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.సంతోష్ కుమార్ పాత్ర, డైరెక్టర్ జి.రాజశేఖర్ యాదవ్, జి.జైకిసాన్ యాదవ్తో పాటు ఆయా కంపెనీల ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.