కీసరలో రూ.1.50 కోట్లతో నిర్మించిన గిడ్డంగిని ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
కీసర/మేడ్చల్ రూరల్, మే 8 : వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వం మంచి ధరకు కొనుగోలు చేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కీసర మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొత్తగా నాబార్డు నుంచి రూ.1.50 కోట్లతో నిర్మించిన గిడ్డంగిని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రైతులు ఇబ్బందులు పడకుండా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు కూడా సరైన ధర ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులకు రూ.10వేల పంట నష్టం కింద ఇస్తున్నాడన్నారు. కేంద్రంలో బీజేపీ రైతులను మోసం చేస్తుందని, దమ్ముంటే కేంద్రం రైతులకు రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి మరెక్కడా జరుగలేదన్నారు. సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో గెలిచి దేశ ప్రధాని కావడం ఖాయమన్నారు. మహారాష్ట్రలో మన బీఆర్ఎస్కు చక్కటి ఆదరణ లభిస్తుందన్నారు. అదేవిధంగా మేడ్చల్ మండలంలోని పూడూర్ గ్రామంలో సోమవారం మంత్రి మల్లారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, కీసర తహసీల్దార్ గౌరీవత్సల, వైస్ చైర్మన్ బెస్త వెంకటేశ్, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ భాస్కర్యాదవ్, వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, కీసర ఎంపీపీ మల్లారపు ఇందిరాలక్ష్మీనారాయణ, వైస్ ఎంపీపీ జలాల్పురం సుధాకర్రెడ్డి, నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ బండారు మల్లేశ్యాదవ్, మండల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి, వైస్ చైర్మన్ పన్నాల బుచ్చిరెడ్డి, కీసర సర్పంచ్ నాయకపు మాధురివెంకటేశ్, మండల పార్టీ అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్రెడ్డి, బీఆర్ఎస్ మండల నాయకులు, పలువురు పాల్గొన్నారు.