రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
అరున్నర కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం
శామీర్పేట, ఏప్రిల్ 3: బీజేపీ, కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమి లేదని, కేవలం మాయ మాటలతోనే పబ్బం గడుపుతున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన కేశవరంలో ముఖ్యమంత్రి ప్రత్యేక నిధులు (ఎస్డీఎఫ్) అరున్నర కోట్లతో నిర్మించిన అభివృద్ధి కార్యక్రమాలను ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశ చరిత్రలో కనివిని ఎరగని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి ప్రజలకు అందజేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టని ఆసరా పింఛన్ మొదలుకొని కల్యాణ లక్ష్మి, కుల వృత్తులకు సబ్సిడీపై గొర్రెలు, చేపలు, పనిముట్లు, రైతు బంధు, రైతు బీమా, నిరంతర విద్యుత్, దళిత బంధు వంటి మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు.
కేశవరం గ్రామంలో అరున్నర కోట్లతో నిర్మించిన పనులను ఆదివారం ప్రా రంభించామని, ప్రజలకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు తలెత్తకుండా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పాలన సాగిస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ ఎంపీటీసీ హనుమంత్రెడ్డి కోరిక మేర కు 58 ఏండ్లు నిండిన వారికి పింఛను, దళిత బంధు ఈ బడ్జెట్లో ప్రజలకు అందించబోతున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, ఎంపీపీ హారిక, జడ్పీటీసీ అనితా లాలయ్య, సర్పంచ్లు జ్యోతి బలరాం గౌడ్, జామ్ రవి, విష్ణువర్ధన్ రెడ్డి, ఇస్తారి, సింగం ఆంజనేయులు, ఎంపీటీసీ హనుమాంత్రెడ్డి, కో ఆఫ్షన్ సభ్యు డు గౌస్ పాషా, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, రైతు బంధు అధ్యక్షులు శ్యామల, కంటం కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ పులి ప్రదీప్, ఈఈ రామ్మోహన్, ఎంపీడీవో పద్మావతి, ఆర్ఐ నరేశ్, సీఐ సుధీర్ కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మల్లేష్ గౌడ్, సుదర్శన్, ప్రధాన కా ర్యదర్శి అనిల్రెడ్డి, మద్దుల శ్రీనివాస్రెడ్డి, హరి మోహన్రెడ్డి, విష్ణు గౌడ్, భూమేష్ గౌడ్, గోపాల్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.