పీర్జాదిగూడ, 15: ఉమ్మడి పాలనలో ఆదరణ కోల్పోయిన చెరువులకు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పునరుద్ధరణకు శ్రీకారం చుట్టారని..దీని వల్ల చెరువులు అభివృద్ధికి నోచుకున్నాయని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో హెచ్ఎండీఏ నిధులతో అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిద్దిన మినీ ట్యాంక్ బండ్( పెద్ద చెరువు)ను మంత్రి మల్లారెడ్డి , మేయర్ జక్క వెంకట్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పెద్ద చెరువు గతంలో నిర్లక్ష్యానికి గురైందని , నేడు మినీ ట్యాంక్ బండ్తో సుందరంగా మారిందన్నారు.
అభివృద్ధిలో పీర్జాదిగూడ కార్పొరేషన్ ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ముందుగా మహిళలు బోనాలు, బతుకమ్మలతో ర్యాలీగా తరలివచ్చారు. చెరువు వద్ద రంగు రంగుల విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయగా… మహిళలు కోలాటం ఆడారు. యువతీయువకులు ఆటా పాటలతో డ్యాన్సులు చేశారు. గ్రామస్తులు కట్ట మైసమ్మకు పూజలు చేసి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శివకుమార్గౌడ్, కార్పొరేటర్లు హరిశంకర్రెడ్డి, అనంతరెడ్డి, సుభాష్నాయక్, సరిత దేవేందర్గౌడ్, రమ్య, శశరేఖ, నాయకులు సతీశ్ గౌడ్, అంజిరెడ్డి, చంద్రారెడ్డి, బుచ్చియాదవ్, స్థానికులు పాల్గొన్నారు.