మేడ్చల్ రూరల్, ఏప్రిల్ 4 : సీఎం సహాయనిధి పేదలకు వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డుకు చెందిన సకీర్తి ప్రసాద్కు సీఎం సహాయనిధి నుంచి రూ.60వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును మంత్రి మల్లారెడ్డి సోమవారం తన కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ దేవరాజ్, మాజీ ఉప సర్పంచ్ నర్సింహా రెడ్డి, సందీప్గౌడ్, హరికృష్ణ, మహేశ్ యాదవ్ పాల్గొన్నారు.
గుండ్లపోచంపల్లికి చెందిన ఒకరికి..
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డుకు చెందిన కొయ్యడ సత్తయ్య చైర్మన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి సహకారంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు ఆయనకు రూ.24వేల చెక్కు మంజూరైంది. ఈ చెక్కును కౌన్సిలర్లు, నాయకులు సోమవారం లబ్ధిదారుడికి అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు జైపాల్ రెడ్డి, మల్లికార్జున్ ముదిరాజ్, బాలరాజు, హేమంత్ రెడ్డి, టీఆర్ఎస్ మున్సిపాలిటీ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, నాయకులు జనార్దన్ రెడ్డి, బాలరాజ్, రమేశ్ పాల్గొన్నారు.