కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లో చెక్కులు పంపిణీ
పీర్జాదిగూడ, ఏప్రిల్ 18 : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. పీర్జాదిగూడ నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో మంత్రి, మేయర్ జక్క వెంకట్రెడ్డి సోమవారం 16 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పేదింటి ఆడబిడ్డలు షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారని తెలిపారు. ప్రతి పేదింటి బిడ్డకు పెండ్లికానుకగా రూ.లక్షా116 ఇస్తున్నదని చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు యుగేందర్రెడ్డి, హరిశంకర్ రెడ్డి, నవీన్రెడ్డి, అనంతరెడ్డి, సుభాష్నాయక్, అమర్సింగ్, పోచయ్య, సరిత దేవేందర్గౌడ్, రమ్య సతీశ్గౌడ్, శారద ఈశ్వర్రెడ్డి, మంజుల రవీందర్, నాయకులు శ్రీధర్రెడ్డి, అంజిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, కృష్ణగౌడ్, మహేశ్, జావిద్ఖాన్ పాల్గొన్నారు
సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం..
బోడుప్పల్ : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి మల్లారెడ్డి అన్నారు. బోడుప్పల్ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ బుచ్చిరెడ్డితో కలిసి సోమవారం 24మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ….మ్యానిఫెస్టోలో ప్రకటించకున్నా పేదింటి ఆడబిడ్డలను ఆర్థికంగా ఆదుకోవాలనే చిత్తశుద్ధితో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఘట్కేసర్ మండల పరిధిలో…
ఘట్కేసర్ రూరల్ : మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. వైస్ ఎంపీపీ జంగమ్మ, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావనీ జంగయ్య యాదవ్, తాసీల్దార్ విజయలక్ష్మి, సర్పంచులు, బోడుప్పల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సంజీవరెడ్డి, నాయకులు పాల్గొన్నారు.
మైనార్టీల అభ్యున్నతే లక్ష్యం : మంత్రి
ఘట్కేసర్ రూరల్ : సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం అందజేస్తున్న కానుకలను మంత్రి ముస్లిం సోదరులకు అందజేశారు. ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, వైస్ ఎంపీపీ జంగమ్మ, తాసీల్దార్ విజయలక్ష్మి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి ప్రవీన్ రెడ్డి, సర్పంచులు కావేరి , మంగమ్మ, సురేశ్ పాల్గొన్నారు.