శామీర్పేట, అక్టోబర్ 6: కాంగ్రెసొళ్ల మాటలు నమ్మి వారికి ఓటేస్తే పథకాలు బంద్ అవుతాయని, వారు ప్రజలను నిండాముచ్చుతారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆరోపించారు. ఉమ్మడి శామీర్పేట మండలంలో గురువారం పర్యటించిన మంత్రి తుర్కపల్లి గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను శుక్రవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు.లబ్ధిదారులు, కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేయించారు. ప్రస్తుతం 40 ఇండ్లు పూర్తిగా పంపిణీ చేవామని, ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఇండ్లను లబ్ధిదారులకు త్వరలోనే అందిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముందుగా ఆద్రాస్పల్లి గ్రామంలో పర్యటించిన మంత్రి సొంత నిధులతో నిర్మించిన ముదిరాజ్ భవనాన్ని ప్రారంభించారు.
గ్రామంలో అవసరం ఉన్న ప్రతి చోటు సీసీ రోడ్లు వేయిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల బాగోగులు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీ నేతలకు విషం కక్కుతున్నారని ఆరోపించారు. మాయమాటు చెప్పి పబ్బం గడిపే కాంగ్రెస్ నేతల మాటలు నమ్మొవద్దన్నారు.
కాంగ్రెస్ను నమ్మడం అంటే ఉన్న పథకాలను మూసుకోవడమేనని ప్రజలకు సూచించారు. వాళ్లు పాలించిన సమయంలో రూ.200ల పింఛన్ తప్ప ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు.ఆసరా ఫించన్ మొదలుకుని ఇంటింటికీ నల్లా నీళ్లు, రైతుబంధు, బీమా, దళితబంధు, బీసీ బంధు, గృహలక్ష్మి, డబుల్ ఇండ్లు, కల్యాణలక్ష్మి, బతుకమ్మ చీరల పంపిణీ వంటి పథకాలతో అనుక్షణం ప్రజల్లో ఉంటున్న బీఆర్ఎస్పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సుజాత, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీకాంత్రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు జహీరుద్దిన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, మండల అధ్యక్షులు సుదర్శన్, మల్లేశ్గౌడ్, సర్పంచ్లు లలితనర్సింలు, విష్ణువర్ధన్రెడ్డి, హరిమోహన్రెడ్డి, ఉపసర్పంచ్లు జహంగీర్, యూసఫ్బాబా, మాజీ సర్పంచ్లు రవీందర్, మల్లేశ్, హరిమోహన్రెడ్డి, లక్ష్మీనారాయణ, ఫణిరాజ్, మహేశ్, దయాకర్, రాములునాయక్, నవీన్, భాస్కర్, వెంకటేశ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.