సిటీబ్యూరో, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ):ట్రాఫిక్ జంఝాటాలు లేకుండా ప్రయాణం సాగడమే లక్ష్యంగా నగరంలోవీలైన చోట్ల ఫ్లైఓవర్లు, అండర్పాస్లు నిర్మిస్తూ మౌలిక వసతులను మెరుగు పరుస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఐటీ కారిడార్ వాసులకు కొత్త సంవత్సర కానుక అందిస్తున్నది. 263 కోట్ల రూపాయలతో కొత్తగూడ వద్ద నిర్మించిన ఫ్లైఓవర్ ఆదివారం (జనవరి 1) నుంచి అందుబాటులోకి రానున్నది. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం పన్నెండున్నరకు ఈ వంతెనను ప్రారంభించనున్నారు. ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన 47 పనుల్లో ఇది 34వ ప్రాజెక్టు. 18వ ఫ్లై ఓవర్. మొత్తం 3 కిలోమీటర్ల పొడవున్న ఈ ఫ్లైఓవర్తో గచ్చిబౌలి క్రాస్ రోడ్స్ నుంచి ఆల్విన్ చౌరస్తా వరకు, బొటానికల్ గార్డెన్ నుంచి గూగుల్ కార్యాలయం వరకు సిగ్నల్ ఫ్రీ ప్రయాణం చేయవచ్చు. కొత్తగూడ వద్ద నిర్మించిన అండర్పాస్తో కొండాపూర్ నుంచి వచ్చేవారు ఎక్కడా ఆగకుండా గచ్చిబౌలికి చేరుకోవచ్చు. ఇది కూడా ఆదివారమే అందుబాటులోకి రానున్నది.
నగర వాసులకు కొత్త సంవత్సరం కానుకగా కొత్తగూడ ఫ్లై ఓవర్ అందుబాటులోకి రానుంది. జనవరి 1న రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం 12.30 గంటలకు ఫ్లైవర్ను ప్రారంభించనున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న వెస్ట్జోన్లో ఐటీ కారిడార్లో కీలకమైన ప్రాంతాలుగా ఉన్న కొండాపూర్, కొత్తగూడ ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ సమస్య పరిషారానికి రూ. 263 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 3 కిలో మీటర్ల పొడవుతో కొత్తగూడ ఫె్లైఓవర్ను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఆర్డీపీలో భాగంగా నిర్మించింది. హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చేపట్టిన ఎస్ఆర్డీపీలో 34వ ప్రాజెక్టుగా ఉంది.
కొత్తగూడ, కొండాపూర్ జంక్షన్ల మీదుగా మూడు కిలోమీటర్ల పొడవుతో చేపట్టిన ఈ ఫె్లై ఓవర్తో పాటు దాని కింద కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లేందుకు వీలుగా 470 మీటర్ల పొడవు తో 11 మీటర్ల వెడల్పుతో అండర్ పాస్ను సైతం నిర్మాణం చేపట్టి చేపట్టి పూర్తి చేశారు. ఇందులో 65 మీటర్ల పొడవుతో క్లోజ్డ్ బాక్స్ 425 మీటర్ల ఓపెన్ బాక్స్ గల అండర్ పాస్ చేపట్టామని జీహెచ్ఎంసీ అధికారులు వివరించారు. ఈ జంక్షన్ల పరిసరాల్లో అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉండడంతో రద్దీ సమయంలో ట్రాఫిక్ సమస్య ఉండదు. గచ్చిబౌలి నుంచి మియాపూర్ వరకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు కనెక్టివిటీతో పాటు మియాపూర్, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిసర ప్రాంతాలను కలుపుతుంది. బొటానికల్ గార్డెన్, కొత్తగూడ జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య పరిషారంతో పాటు కొండాపూర్ జంక్షన్లో భారీగా ట్రాఫిక్ సమస్య తీరనున్నది.
ఎస్ఆర్డీపీలో 34వది..
ప్రయాణం సాఫీగా సాగాలంటే వాహనం ఉంటే సరిపోదు.. సరైన రోడ్డు మార్గం ఉండాలి. ఇదే స్ఫూర్తితో జీహెచ్ఎంసీ పరిధిలోని నివాసితులకు ట్రాఫిక్ సమస్యను అధిగమించి సకాలంలో గమ్యస్థానానికి చేరేందుకు ఫె్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్వోబీలను వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి (ఎస్ఆర్డీపీ) పథకం చేపట్టడం మూలంగా చకటి రోడ్డు మార్గం ఏర్పడింది. ఈ విషయంలో రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ కృషి చాలా ఉందని చెప్పవచ్చు. సిగ్నల్ రహిత రవాణా వ్యవస్థకు చేపట్టిన ఎస్ఆర్డిపి పథకాలు ఒకొకటి ప్రజలకు అందుబాటులోకి రావడంతో చేరవలసిన గమ్యస్థానానికి సకాలంలో సురక్షితంగా చేరుతున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా మొత్తం 47 పనులను చేపట్టగా అందులో 34 ప్రాజెక్టులు పూర్తి కాగా, మరిన్ని ప్రాజెక్టుల పనులు వేగంగా నిర్మాణం పూర్తి చేసుకునే దశలో ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు 17 ఫె్లైఓవర్లు అందుబాటులోకి రాగా, కొత్తగూడ ఫె్లై ఓవర్ నగరంలో 18వ ఫ్లై ఓవర్గా ట్రాఫిక్ సమస్యలను తీర్చనున్నది.