సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్సార్డీపీ మరో మైలురాయిని చేరుకున్నది. రూ.32 కోట్లతో చేపట్టిన ఎల్బీనగర్ ఆర్హెచ్ఎస్ ఫ్లై ఓవర్ను శనివారం మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఎస్సార్డీపీలో 19వ ప్రాజెక్టు అయిన ఈ పై వంతెనను 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. దీని వల్ల ఏపీ నుంచి ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే ప్రజలతో పాటు హయత్నగర్ మీదుగా ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా వెళ్లొచ్చు.