కొత్తగా వచ్చిన యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్తో కలిసి కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్ కాంప్లెక్స్ను మంత్రి కేటీఆర్ సందర్శించారు. ఈ పార్కును పూర్తి చేయడం కోసం యూఎస్ కాన్సులేట్ 1.1 లక్షల డాలర్ల ఫండింగ్ అందిస్తోంది. ఈ ప్రాజెక్టును ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ చేపట్టింది. సమాధుల కాంప్లెక్స్లో ఉన్న ఐదు బావుల పునరుద్ధరణకు ఈ ప్రాజెక్టు పనిచేస్తుంది. ఈ బావులు వర్షాకాలంలో 15 మిలియన్ లీటర్ల నీటిని నిల్వ చేస్తాయి.
ఈ నీటితో 106 ఎకరాల్లో ఉన్న హెరిటేజ్ పార్క్ అవసరాలు తీరతాయి. ‘హైదరాబాద్లోని అతిగొప్ప చారిత్రక కట్టడాల్లో కుతుబ్ షాహీ సమాధులు కూడా ఉంటాయి. అందుకే దీన్ని పునరుద్ధరించి, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ కలను నిజం చేయడానికి ఆగా ఖాన్ ట్రస్ట్ నైపుణ్యాలు, యూఎస్ కాన్సులేట్ సపోర్ట్ ఎంతో సాయం చేస్తున్నాయి’ అని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు.