రంగారెడ్డి : జిల్లా పరిధిలోని ఆదిభట్ల మున్సిపాలిటీలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. బొంగుళూరు నుంచి ఆదిభట్లకు రూ. 18 కోట్లతో నిర్మాణం చేయనున్న మంచినీటి పైపులైన్ పనులను ప్రారంభించారు.
నాదర్గుల్ – సాగర్ రోడ్డు హైలేవల్ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ బ్రిడ్జిని రూ. 3.16 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ కార్యక్రమాల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, జడ్పీ చైర్మన్ అనితా రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.