హైదరాబాద్ : హైదరాబాద్ నగర శివార్లలోని గండిపేట జలాశయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పార్కు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ పార్కులో యాంఫీ థియేటర్ను కూడా ఏర్పాటు చేశారు. గండిపేట పార్కును అద్భుతంగా తీర్చిదిద్దిన అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్కు, హెచ్ఎండీఏ బృందానికి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అందమైన హైదరాబాద్ నగరానికి ఈ పార్కు మరింత శోభను తీసుకొస్తుందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
గండిపేట్ పార్కును 5.50 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దారు. రూ. 35.60 కోట్ల వ్యయంతో పార్కును ఏర్పాటు చేశారు. సెంట్రల్ పెవిలియన్, టికెటింగ్ కౌంటర్లు, ఎంట్రెన్స్ ప్లాజా, వాక్వేస్, ఆర్ట్ పెవిలియన్, ప్లవర్ టెర్రస్, పిక్నిక్ స్పేసెస్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఇన్నర్ యాక్సెస్ రోడ్డు, కిడ్స్ ప్లే ఏరియా, ఫుడ్ కోర్టులను రూ.35.60 కోట్ల వ్యయంతో నిర్మించారు.
Gandipet park development by @HMDA_Gov is ready for inauguration – it has an amphi-theatre and lots of green open spaces
Well done @arvindkumar_ias and team 👍
Another nice new addition to greening the🌲 beautiful city of Hyderabad pic.twitter.com/CoLcPmZX6H
— KTR (@KTRTRS) September 3, 2022