సిటీబ్యూరో, జూన్ 30(నమస్తే తెలంగాణ): దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ను నిలపాలన్న లక్ష్యంలో భాగంగా నూతన మురుగునీటి శుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మాణ పనులు తుది దశకు చేరుకోగా, నిర్మాణ పనులు పూర్తయిన చోట ఒక్కొక్కటిగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీపీల పనుల్లో దుర్గం చెరువు 7 ఎంఎల్డీ సామర్థ్యంతో ట్రయల్ రన్ విజయవం తం అయ్యింది. ఇదే సమయంలో 15 ఎంఎల్డీ సామర్థ్యంతో కోకాపేటలో ఎస్టీపీ పనులు పూర్తి అయ్యాయి. ఈ కోకాపేట ఎస్టీపీని శనివారం పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారా వు ప్రారంభించనున్నారు.
31 ఎస్టీపీలలో తొలి ఫలితం కోకాపేట కావ డం గమనార్హం. వచ్చే వారంలో దుర్గం చెరువు ఎస్టీపీని ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, వచ్చే సెప్టెంబరు నాటికల్లా 31 ఎస్టీపీలన్నీ అందుబాటులోకి వచ్చేలా అధికారులు పనులు వేగిరం చేశారు.
రూ. 33.67 కోట్లతో 15 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్బీఆర్ టెక్నాలజీతో ఈ కోకాపేట ఎస్టీపీ నిర్మాణం జరిగింది. 14 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఇంటరాప్షన్ అండ్ డైవర్షన్ పనులు చేపట్టారు. వట్టి నాగులపల్లి, తేజ్ నగర్, జర్నలిస్టు కాలనీ, గౌలిదొడ్డి, ఐఎస్బీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కాంపెనీలు విప్రో, మైక్రోసాఫ్ట్ తదితర ప్రాం తాలలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కా రం లభించనుంది. కాగా, అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణాలు జరుగుతున్నాయి. మెట్రో నగరాల్లో స్థలాభావం ఉంటుంది. కాబట్టి ఎస్బీఆర్ టెక్నాలజీతో నిర్మాణం అనువుగా ఉంటుంది. వీటి వల్ల ఒకే ఛాంబర్లో ఐదు స్టేజీల మురుగునీటి శుద్ధి ప్రక్రియ జరిగి, తకువ విస్తీర్ణంలో ఎకువ నీటిని శుద్ధి చే స్తాయి. దేశంలో వినియోగిస్తున్న వివిధ బయోలాజికల్ ట్రీట్మెం ట్ పద్ధతుల కం టే ఈ ఎస్బీఆర్ విధానానికి త కువ ఖర్చు అవడంతో పాటు మె రుగ్గా మురుగునీటి శుద్ధి జరుగుతుంది. ఇది తేలికైన విధానం.