‘ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది. ఈ ప్రశాంతత ఇలాగే కొనసాగాలన్నా.. పెట్టుబడులు రావాలన్నా..విశ్వనగరం కావాలన్నా.. బలమైన నాయకత్వం..స్థిరమైన బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యం. కరెంటు, తాగునీరు, ప్రజా రవాణా మెరుగుపర్చుకున్నాం. వచ్చే టర్మ్లో 24 గంటల తాగునీరు, చెరువులు, డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపర్చుకుందాం. 400 కిలోమీటర్ల మేర అదనంగా మెట్రోను విస్తరించుకుందాం. అమ్మలా అన్నంపెడుతున్న హైదరాబాద్ను కాపాడుకుందాం’. అని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో మంత్రి కేటీఆర్ రోడ్ షోలో పాల్గొని.. బీఆర్ఎస్ అభ్యర్థులు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్కు మద్దతుగా ప్రసంగించారు. తొమ్మిదిన్నరేండ్లలో అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామని, అభివృద్ధిలో హైదరాబాద్ దూసుకుపోతున్నదని చెప్పారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే.. మళ్లీ మతకల్లోలాలే తప్ప.. అభివృద్ధి ఉండదన్నారు.
ఎన్నడూ లేనంతగా హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంది..ఈ ప్రశాంతత కొనసాగాలన్నా.. పెట్టుబడులు రావాలన్నా ..విశ్వనగరం కావాలన్నా.. బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వమైన బీఆర్ఎస్తోనే సాధ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. తొమ్మిదిన్నరేండ్లు అన్నదమ్ముల్లా కలిసి ఉన్నామని.. అమ్మలా అందరికీ అన్నం పెడుతున్న హైదరాబాద్ను కాపాడుకుందామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ వస్తే మళ్లీ మతకల్లోలాలే తప్ప అభివృద్ధి ఉండదన్నారు. చీకటి రోజులు..కరెంట్ కోతలు, ఛార్జీలు మోతలు తప్పవన్నారు. బీఆర్ఎస్ హయాంలో కరెంట్, మంచినీటిని మెరుగుపర్చుకున్నామని చెప్పారు. వచ్చే టర్మ్లో 24 గంటల తాగునీరు, చెరువులు, డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపర్చుకుందామన్నారు. ఢిల్లీ నుంచి వచ్చే నేతలకు భయపడేది లేదన్నారు. సింహం లాంటి సీఎం కేసీఆర్ను ఎదుర్కొనేందుకు గుంపులు గుంపులుగా ఎక్కడెక్కడి నుంచో దిగుతున్న నేతలకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ నియోజకవర్గాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్లను నవంబర్ 30న కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.