హైదరాబాద్ : నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ కార్యాలయంలో జరిగిన సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా గ్రేటేర్లో రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం, నిర్మించిన వాటిని లబ్ధిదారులకు అందించే విషయమై చర్చించారు.
సమావేశానికి పురపాలక, గృహనిర్మాణ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నగరంలో రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన 60వేల ఇండ్లకు పంపిణీకి వారంల్లోగా మార్గదర్శకాలను సిద్ధం చేయాలని చెప్పారు.
సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక ఉండాలని, ఇండ్లు లేని నిరుపేదలకే డబుల్ బెడ్రూంలు అందేలా చూడాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికకు ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయాలన్న కేటీఆర్.. వచ్చేవారం మరోసారి డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలపై సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.