హైదరాబాద్: మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో పర్యటించనున్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో రూ.61 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రసూల్పురా క్రాస్ రోడ్లోని హాకీ స్టేడియం వద్ద ఉన్న నాలా అభివృద్ధి పనులను కేటీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం రసూల్పురాలోని కరాచీ బేకరీ వద్ద నాలా అభివృద్ధి పనులు జరుగనున్నాయి.
ఎస్ఆర్డీపీ పనుల్లో భాగంగా పాటిగడ్డలో చేపట్టిన మల్టీఫర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు, అల్లంతోట బావిలో నాలా అభివృద్ధి పనులు, బ్రాహ్మణ వాడిలో నాలా అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.