హైదరాబాద్: హైదరాబాద్లోని పంజాగుట్ట చౌరస్తాలో (Punjagutta circle) ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ (Ambedkar) విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జై భీమ్.. జై కేసీఆర్ నినాదాలతో పంజాగుట్ట కూడలి మారుమోగింది.