నేరేడ్మెట్, మార్చి 27 : సైనికుల త్యాగాలకు వెలకట్టలేమని ఎస్సీ, గిరిజన, బీసీ, మైనారిటీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం నేరేడ్మెట్ డివిజన్ డిఫెన్స్కాలనీ నిర్మల్నగర్ చౌరస్తాలో డిఫెన్స్ హౌసింగ్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మాజీ సైనికులకోసం అపార్టుమెంట్ భవనాన్ని నిర్మించేందుకు స్థానిక కార్పొరేటర్ మీన ఉపేందర్రెడ్డితో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఎక్స్ సర్వీస్మెన్, ఆర్మీ వితంవుల కోసం నిర్మాణం చేపట్టడం ఎంతో సంతోషకరమన్నారు.
డిఫెన్స్కాలనీ సేవా భావంతో పనిచేయడం, 62 సంవత్సరాల సొసైటీని ఎంతో అద్భుతంగా, విజయవంతంగా అభివృద్ధి చేయడం సంతోషకరమని సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిఫెన్స్కాలనీ అధ్యక్షుడు ఎన్వీ సారధి, వైస్ ప్రెసిడెంట్ కేవీ రావు, సెక్రటరీ శివయ్య, కోశాధికారి ప్రకాశ్ రెడ్డి, కమిటీ మెంబర్లు బీఎస్ఎన్ రెడ్డి, రాజరత్నం, సంగమిత్ర, రాణి చంద్రశేఖర్, కేఎస్ రావు, కొప్పుల కుషాల్, ఎస్కే జేమ్స్ ఎంటర్ప్రైజెస్ యజమాని రాబిన్ జేమ్స్, ఎండీ ఇలియాస్, కన్నా, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చ్ 27 (నమస్తే తెలంగాణ): ట్యాంక్బండ్ నెక్లెస్రోడ్ మార్గంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేదర్ భారీ విగ్రహం తుది మెరుగులు దిద్దుకుంటున్నది. సోమవారం ఉదయం నిర్మాణ పనులను రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఏప్రిల్ 14న విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్న నేపథ్యంలో త్వరగా పనులను పూర్తిచేయాలని అధికారులకు సూచించారు.