సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అధికారులను కోరారు. హరి త ప్లాజా హోటల్లో జిల్లా అభివృద్ధి సమన్వ య, పర్యవేక్షణ సమితి (దిశా) సమావేశంలో కేంద్ర మంత్రి శనివారం పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో అమలవుతున్న అభివృద్ధి పనులపై మంత్రి సమీక్షించారు.
బ్యాంకు, విద్యా, ఆరోగ్య, రైల్వే, వాటర్ వ ర్క్స్, సివిల్ సైప్లె, నేషనల్ హైవే, మహిళా శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ, ఎస్సీ కార్పొరేషన్, మైనార్టీ, పవర్ సప్లయ్, వివిధ విభాగాలపై సమీక్షించారు. బ్యాంకు రుణాల కోసం దరఖా స్తు చేసుకున్న వారికి ఎంత మేరకు రుణాలు మంజూరు చేశారో ఆరా తీశారు. జీహెచ్ఎంసీ అధికారులను ముద్ర, స్వానిధి, శిశు, కిషోర్, తరుణ్ గురించి తెలుసుకున్నారు.
ఈ సమావేశంలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడు తూ కేంద్ర పథకాలు సమన్వయం చేసుకుం టూ పనులు వేగవంతం చేయాల్సి ఉందని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్, జిల్లా ప్రణాళిక అధికారి సురేందర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.