హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమితులైన మైనార్టీ నాయకుల అభినందన సభను హైదరాబాద్ జలవిహార్లో గురువారం నిర్వహించారు. హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి హరీశ్రావు వారిని అభినందించి, సత్కరించారు.
హజ్ కమిటీ చైర్మన్ సలీం, వక్ఫ్ బోర్డు చైర్మన్ మసి ఉల్లా ఖాన్, మైనార్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇన్సాక్ ఇంతియాజ్, మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఫ్ అన్సారీ, సివిల్ సైప్లె కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ తన్వీర్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజుబుద్దీన్లకు శాలువాలు కప్పి, పూలదండలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు షకీల్, దానం నాగేందర్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.