హైదరాబాద్ : కామారెడ్డి, నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై, మొన్న ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పంచాయతీరాజ్ శాఖ ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా కవితని మంత్రి సత్కరించి అభినందించారు. జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షించారు.