హైదరాబాద్ : తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించిన ప్రజా సంబంధాల అధికారి మార్గం లక్ష్మీనారాయణను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.
తెలుగు విశ్వ విద్యాలయం గిరిజన విజ్ఞాన అధ్యయన శాఖ ఆధ్వర్యంలో వరంగల్లోని జానపద గిరిజన విజ్ఞాన పీఠంలో ‘మారుతున్న గిరిజనుల సామాజిక, సాంస్కృతిక స్థితిగతులు – ఐ.టి.డి.ఎ. ప్రభావం, గోవిందరావుపేట మండలం’ అనే అంశంపై యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ పర్యవేక్షణలో పరిశోధనకు గాను మార్గం లక్ష్మీనారాయణకు యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటిచింది.
రవీంద్రభారతిలో బుధవారం జరిగే స్నాతకోత్సవంలో ఈ అవార్డును అందచేయనున్నారు. ఈ సందర్భంగా తన వద్ద పి.ఆర్.ఓ.గా పని చేస్తున్న మార్గం ను మంత్రి హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. శాలువాతో సత్కరించారు.