ఖైరతాబాద్, ఏప్రిల్ 14 : ఖైరతాబాద్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.4కోట్లు, సీవరేజీ లైన్లకు రూ.1.56కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. గురువారం ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో రూ.13.56లక్షల వ్యయంతో చేపట్టిన 200 మీటర్ల తాగునీటి పైపులైను పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నడిబొడ్డులో ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్లో గత కొంత కాలంగా మురికి నీళ్లు వస్తున్నాయని స్థానికులు తన దృష్టికి తీసుకొచ్చారని, వెంటనే వాటర్ వర్క్స్ అధికారులతో మాట్లాడి ఇక్కడ కొత్త పైపులైను నిర్మాణాన్ని మంజూరు చేశానన్నారు. రాజ్దూత్ హోటల్ నుంచి సీఐబీ క్వార్టర్స్ వరకు రూ.56లక్షలతో మరో పైపులైను నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జీఎం సంతోష్ కుమార్, డీజీఎం శ్రీనివాస్, మేనేజర్ స్వామి, టీఆర్ఎస్ నాయకులు గజ్జెల అజయ్, వైల ప్రవీణ్ కుమార్, మహేందర్ బాబు, మహేశ్ యాదవ్, ఓల్డ్ సీఐబీ క్వార్టర్స్ బస్తీ కమిటీ అధ్యక్షులు కె. రాజు, ఉపాధ్యక్షుడు గోపాల్, ఎండీ నయీముద్దీన్ పాల్గొన్నారు.