పీర్జాదిగూడ, జూన్ 9: రాష్ట్రంలోని బీఆర్ఎస్ సర్కార్ తొమ్మిదేండ్లలోనే సకల జనుల పెన్నిధిగా మారిందని, దేశంలోనే ఎక్కడా లేని విధంగా సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సంక్షేమ పథకాలను పక్కగా అమలు చేస్తుందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శక్రవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఎంకేబీఆర్ గార్డెన్లో మేయర్ జక్కా వెంకట్రెడ్డి, పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అనివార్యంగా మారిన నేపథ్యలో ముఖ్యమంతిర కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపనకు శ్రీకారం చుట్టారని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ దేశమంతటా అమలు కావాలంటే కేసీఆర్ లాంటి దూర దృష్టి ఉన్న నాయకుడు ఈ దేశానికి అవసరమని పేర్కొన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుంద ని, అలాగే తెలంగాణాలో అన్ని మున్సిపాలటీలో పీర్జాదిగూడ ఆదర్శంగా నిలుస్తుందని కితాబిచ్చారు. గతంలో 200 వందల ఉన్న పింఛన్లు సీఎం కేసీఆర్ పదింతలు పెంచి పేదలకు ఆసరా అవుతున్నారని, ప్రజా సంక్షమమే లక్ష్యంగా బీఆర్ఎస్ పాలన కొనసాగుతుందని తెలిపారు. దళితులకు దళిత బంధుతో, అభాగ్యులకు అండగా ఆస రా, ఆడ పిల్లల పెళ్లికి కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్తో మాతాశిశువులకు భరోసా పథకాలతో పేదలకు అండగా నిలుస్తూనే రైతన్నకు అండగా రైతు బంధు, రైతు బీమా, మిషన్కాకతీతో చెరువులకు పూర్వవైభవం, ఇంటింటికి తాగునీరు, కుల వృత్తులకు పుపరుజ్జీవంలాంటి ఎన్నోకార్యక్రమాలు ఈ తొమ్మిదేళ్లలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మన్ననలను పొందుతుందన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మరోసారి కేసీఆర్ ప్రభుత్వం రావాలని దీవించాలని ఆయన కోరారు. 24 గంంటల విదుత్ సరఫరాతో తెలంగాణ దేదిప్యమానంగా వెలుగుతుందన్నారు. మేయర్ జక్కా వెంకట్రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ప్రభుత్వం అంటేనే సకల జనుల సంక్షమం అన్నారు. అప్పుడే పుట్టిన బిడ్డ మొదలు వృద్దుల వరకు కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ ప్రథకాలను అందిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వంశీకృష్ణ, డిప్యూటీ మేయర్ శివకుమార్గౌడ్, కార్పొరేటర్లు హరిశంకర్రెడ్డి, అనంతరెడ్డి, సుభాష్నాయక్, కౌడె పోచయ్య, బచ్చ రాజు, నవీన్రెడ్డి, మంజుల రవీందర్, ప్రసన్నలక్ష్మీ శ్రీధర్రెడ్డి, శారద ఈశ్వర్రెడ్డి, రాజేశ్వరీ అంజిరెడ్డి, పాశం శశిరేఖ, కో ఆప్షన్ సభ్యులు, సంక్షమ పథకాల లబ్ధిదారులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు వరంలాంటిదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగా రం మున్సిపాలిటీకి చెందిన ఉత్తమ్కుమార్కు రూ.లక్ష 50 వేలు, సురేంద్ రాజు రూ.లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శుక్రవారం మంత్రి మల్లారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగా రం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేతలు మల్లేశ్యాదవ్, శ్రీధర్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, శ్రీకాంత్, పాల్గొన్నారు.
– మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 9