మేడ్చల్ కలెక్టరేట్, ఏప్రిల్ 29 : రాష్ట్రంలో వైద్య రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలోని 18వ వార్డు ఓల్డ్ విలేజ్లో నిర్మించిన బస్తీ దవాఖానను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పేద ప్రజలకు కార్పొరేటుకు ధీటుగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.10 వేల కోట్లు వైద్య రంగానికి కేటాయించి, నగరం నలువైపులా నాలుగు ఆసుపత్రులు నిర్మిస్తున్నారని తెలిపారు. మున్సిపాలిటీలో బస్తీ దవాఖానలను నిర్మించి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నారని చెప్పారు.
తెలంగాణ, మహరాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ర్టాల్లో బీఆర్ఎస్ పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్లు ప్రణీత, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, కమిషనర్ స్వామి, వైద్యాధికారి సరిత, కౌన్సిలర్లు నాను నాయక్, సుజాత, హేమలత, వెంకటేశ్, సురేఖ, పావని, స్వప్న, వెంకటరమణ, అనురాధ, రమేశ్ గౌడ్, నరసింహా రెడ్డి, మౌనిక, శ్రీహరిగౌడ్, కో-ఆప్షన్ సభ్యులు, డీఈ సుమతి, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, ప్రధాన కార్యదర్శి హరి గౌడ్, నాయకులు వైద్యులు, అధికారులు పాల్గొన్నారు.